News

ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు


జపాన్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు ఉదయం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్, ప్రకాశ్ జావదేకర్ తదితరులతో శుక్రవారం చంద్రబాబు నాయడు భేటీ అవుతారు.